
TTDకి Chennai భక్తుడి భారీ విరాళం.. రూ.40 లక్షల Innova Hycross Car అందజేత
తిరుమల శ్రీవారిపై భక్తుల విశ్వాసం రోజు రోజుకు మరింత పెరుగుతోంది. తాజాగా Chennaiకు చెందిన ఓ భక్తుడు టీటీడీకి భారీ విరాళం అందించి వార్తల్లో నిలిచాడు. పోసన ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ Managing Director మగేష్ సుందర్ రూ.40 లక్షల విలువైన Toyota Innova Hycross VZ Model కారును టీటీడీకి విరాళంగా అందించారు.
శుక్రవారం తిరుమలలో జరిగిన కార్యక్రమంలో శ్రీవారి ఆలయం ఎదుట కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కారు తాళాలను ఆలయ Deputy EO లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీకి భక్తులు బంగారం, నగదు, ఆస్తులు మాత్రమే కాకుండా వాహనాలను కూడా విరాళంగా ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాజాగా అందించిన ఈ Innova Hycross కారు టీటీడీ సేవా కార్యక్రమాల్లో ఉపయోగించనున్నట్లు సమాచారం.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ కూడా భారీగా కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న ఒక్కరోజే 67 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.3.45 కోట్లకు చేరినట్లు అధికారులు తెలిపారు.





